KNR: రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయాన్ని బుధవారం రాత్రి దర్శించుకున్నారు. భవానీ మాల దీక్ష విరమణ అనంతరం అమ్మవారి దర్శనానికి మంత్రి శ్రీధర్ బాబును బండి సంజయ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు.