SRCL: బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ముస్తాబాద్ ఎస్సై గణేష్ సూచించారు. బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు విలువైన ఆభరణాలు ధరించి వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, యువకులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని అన్నారు.