MNCL: ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టులో ఎగువ నుంచి వరద పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు ప్రస్తుతం అంతేమేర నీరు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.1754 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 17222 క్యూసెక్కుల నీరు చేరగా దిగువకు విడుదల చేశారు.