• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు.‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...

February 5, 2023 / 01:18 PM IST

సునీత భర్త చాలా తెలివైనవాడు.. నటుడు వేణు కామెంట్స్ వైరల్

‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో వేణు అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చిరునవ్వుతో, హనుమన్ జంక్షన్ ,చెప్పవే చిరుగాలి, వంటి సినిమాలతో పేక్షకులకు చేరువయ్యాడు. వేణు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో వేణు తొట్టెంపూడి మొదట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశారు. వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాం...

February 5, 2023 / 01:08 PM IST

బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ మృతి, కేసీఆర్ సంతాపం

బీఆర్ఎస్ నేత, ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రైతుల సమావేశంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లాలో శనివారం ఉదయం అతని బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. బారుహాన్ సమీపంలో ఖరస్రోటా నదిపై ఉన్న వంతెన మీదుగా అర్జున్ దాస్ వెళ్తున్నారు. అటు వైపు వచ్చిన ట్రక్.. వేగంగా ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించార...

February 5, 2023 / 12:49 PM IST

హైదరాబాద్- విజయవాడ రూట్ లో ప్రయాణం చేస్తున్నారా … బిగ్ అలర్ట్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్ -విజయవాడ రూట్. జాతీయ రహదారిపై 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆంక్షలను విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు తగిన సూచనలు, మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ సవివరంగా వెల్లడించారు. హైదరాబా...

February 5, 2023 / 12:25 PM IST

బాలకృష్ణ.. సారీ చెప్పాలి అంటూ నర్సుల డిమాండ్

బాలయ్య కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రాహ్మణల మనోభావాలను దెబ్బతీసేలా బాలబాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.   దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని ...

February 5, 2023 / 12:01 PM IST

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దుబాయ్‌లో అమెరికాకు చెందిన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవీ చేపట్టక ముందే పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడిగా పనిచేశారు. 1943 ఆగస్ట్ 11వ తేదీన ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. ప్రాథమిక విద్య కరాచీలో గల సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్‌లో జరిగింది. లాహోర్‌లో గల ఫార్మాన్ క్రిస్టి...

February 5, 2023 / 12:51 PM IST

తగ్గేదేలే: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిప్ట్, గన్ మెన్లు వెనక్కి

నెల్లూరు పాలిటిక్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇద్దరు గన్ మెన్లను రీ కాల్ చేసింది. దీంతో కోటంరెడ్డి ఈ రోజు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురిలో ఇద్దరు గన...

February 5, 2023 / 11:49 AM IST

ఆ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా : పీవీ సింధు

ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పీ.వి. సింధు..తన సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు. ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభత్సవానికి విచ్చేసిన ఆమె మీడియాతొ మాట్లాడారు. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకం సాధించడం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్ పతకం తరువాత అంతటి ఆనందం ఈ టోర్నీ విజయంతో వచ్చింద...

February 5, 2023 / 11:27 AM IST

బైడెన్ ఆదేశాలతో చైనా ‘స్పై’ బెలూన్ కూల్చివేత.. చైనా ఆగ్రహాం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో ఆ దేశ రక్షణశాఖ చైనా బెలూన్‌ను కూల్చివేసింది. దక్షిణ కరోలినా తీరానికి సమీపంలో కూల్చివేయగా.. శిథిలాల కోసం అట్లాంటిక్ సముద్రంలో గాలింపు చర్యలను చేపట్టింది. తమ అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ నిఘా పెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్జీనియాలో గల లాంగ్లే ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాప్ట్‌తో క్షిపణిని ప్రయోగించి బెలూన్‌ను నేలమట్టం చేసింది. అమెరికా గగనత...

February 5, 2023 / 11:15 AM IST

బాల్య వివాహాలు చేసుకున్న భ‌ర్త‌ల అరెస్టు.. నిర‌స‌న‌కు దిగిన‌ భార్య‌లు

అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మైనర్లను వివాహం చేసుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం తెలిసిందే. అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు న‌మోదు చేశారు. అలాగే, 2,258 మందిని...

February 5, 2023 / 10:01 AM IST

తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

తెలంగాణ బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అ...

February 5, 2023 / 11:26 AM IST

హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సర్వం సిద్ధం

హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా...

February 5, 2023 / 09:36 AM IST

వాట్సాప్‌లో కొశ్చన్ పేపర్, పరీక్ష రాసిన స్టూడెంట్స్.. ఎక్కడంటే?

పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బ...

February 5, 2023 / 09:56 AM IST

ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం : రుద్రరాజు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకీ ప్రత్యేక హొదా వస్తుందని ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైలు మీదేనని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలుపరుద్దాం కార్యక్రమాన్ని ప్రారింభించారు. అనంతరం ఆయన పలు ప్రాంతల్లో పర్యటించారు. కేంద్ర రాష్ట్...

February 5, 2023 / 08:57 AM IST

నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.

ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా నేడు మహారాష్ట్రలోని నాందేండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, న...

February 5, 2023 / 07:47 AM IST