BPT: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కామేపల్లి కృషి బాబు మృతి చెందాడు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కామేపల్లి కృషి బాబు(65) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: విస్సన్నపేట మండలంలోని చండ్రు పట్ల తండాలో గురువారం సారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సారా కాస్తున్న మహిళ బాణావతు పింప్లిని అరెస్ట్ చేసి ఆమె వద్దనున్న 1 లీటర్ల సారా, 40 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళను తిరువూరు కోర్ట్ ఎదుట హాజరు పరచినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
ప్రకాశం: కొమరోలు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీ ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య అధ్యక్షతన నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మస్తాన్ వలి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి హాజరవుతారని, అన్ని శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.
VSP: వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్గా లలిత్ బోహ్ర నియమితులయ్యారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతక ముందు ఇక్కడ డీఆర్ఎంగా వ్యవహరించిన సౌరబ్ ప్రసాద్ ముంబాయి సీబీఐ లంచం కేసులో పట్టబడిన విషయం పాఠకులకు విదితమే.. త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని రైల్వే వర్గాలు తెలిపారు.
కృష్ణా: గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హైస్కూల్ వద్ద 10వ తరగతి చదువుతున్న బాలికను యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈక్రమంలో అక్కడే విధుల్లో ఉన్న శక్తి టీమ్ సభ్యురాలు స్వర్ణలత వెంటనే స్పందించి అతడ్ని గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సీఐ సీహెచ్. నాగ ప్రసాద్ ఆధ్వర్యంలో బాలిక, యువకుడి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ASF: అడవులు, వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ మజారుద్దీన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో అడవులను సందర్శించారు. ఆయన అడవికి సమీపంలో ఉన్న రైతులు తమ పంట వ్యర్థాలను నిప్పులు పెట్టవద్దని సూచించారు. అడవులను ధ్వంసం చేసినా, వన్యప్రాణులకు హాని కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
GDWL: అయిజ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్ణంగా నిర్మించిన పెద్ద వాగు బ్రిడ్జ్పై గురువారం డేవిడ్ అనే యువకుడు ప్రమాదానికి గురై కర్నూల్లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. బ్రిడ్జ్ స్లాబ్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటంతో వాహనదారులు గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై మూడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
అనంతపురం: భారత మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో మన్మోహన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయడంతో ఆయన నాయకత్వంలోని సాకారం అయిందన్నారు.
MDK: చిన్నశంకరంపేట మండలం సూరారం శివారులో శుక్రవారం ఉదయం కారు బోల్లా పడింది. సూరారం నుంచి ధర్పల్లి వెళ్లే రోడ్డు ఫీడ్ మిల్ ఫ్యాక్టరీ వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.
నిర్మల్: కిస్టాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి పర్యటించనున్నట్లు అసెంబ్లీ కన్వీనర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఎన్నుకున్న 201 బూత్ కమిటీ సభ్యులను సన్మానించనున్నారు.
PPM: గిరిజనుల సాంప్రదాయానికి ప్రతీక అయినా కందికొత్తులు పండుగ నేటి నుంచి ప్రారంభం కానున్నదని గిరిజన సంఘాలునాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొండపోడులో సాగు చేసిన కందులు జొన్నలు, రాగులు, కొర్రలు వరి పంటను ముందుగా గిరిజన దేవతకు నైవేద్యంగా సమర్పిస్తాము. అనంతరం వాటి ఆహారంగా స్వీకరిస్తామని పండగ జరిగే వరకు పంట చేతికొచ్చిన ఆహారం తీసుకోమని తెలిపారు.
GNTR: పత్తి రైతులకు ఆశాజనకంగా ప్రతి అమ్మకాలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను హరిచంద్రపురం, పెద్దపరిమి గ్రామాలలో రైతులు పత్తి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,500 ఉందని, మిల్లర్ల వద్ద రూ.7,300 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. పత్తి పంట దిగుబడితో పాటు ధరలు ఆశాజనకంగా ఉన్నారు.
KNR: గోదావరిఖని RTC డిపో ఆవరణలో పాముల సంచారంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపో చుట్టూ ఉన్న ప్రహరీ అవతల చెత్తాచెదారం ఉండటంతో పాములు తిరుగుతున్నాయి. ఇటీవల ఒకరికి పాము కాటు వేయడంతో చికిత్స పొందుతున్నారు. డిపో ఆవరణలో ఇనుప తుక్కు ఉండటం వల్ల పాములు అధికమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాయని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
SDPT: సికింద్రాబాద్ అశోక్ నగర్ టక్కర బస్తీలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.