KRNL: విలువైన ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం అంటూ శుక్రవారం కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ కార్మికుల పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
NZB: బాల్య వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగేరి బాబు హెచ్చరించారు. శుక్రవారం రుద్రూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
AP: రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడారు. 22వ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22ఏ భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారులను బదలాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
KRNL: పత్తికొండలో చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు . మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇళ్ల తలుపులు, వాహనాలు సురక్షితంగా లాక్ చేసుకోవాలని, సూచించారు.
2026 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఓయూలో జరిగిన సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్లో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన ఈ సమావేశం “Creating AI & Quantum Enabled Higher Educational Institutions” అంశంపై జరిగింది. తెలంగాణ గవర్నర్తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.
KRNL: ఆదోని పట్టణ పరిధిలోని తిక్క స్వామి దర్గా ప్రాంతంలోని అంగనవాడీ కేంద్రం 85ను శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , సీడీపీఓ ఢిల్లీ ఈశ్వరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, పీడీ విజయ పిల్లలు హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే పిల్లలుకు ఇస్తున్న ఆహరం, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందు సరుకుల నిలువ, కేంద్రం పరిశుభ్రతను తనిఖీ చేశారు.
SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో సంత్ శ్రీ గురు రవిదాస్ 649వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని సంత్ రవిదాస్ విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
AP: అప్పుల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో తొలిసారి 13 పైసలు ట్రూడౌన్ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1.5కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. యూనిట్ కొనుగోలు ధరను రూ.6.35ను తగ్గించి రూ.340 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు.