AP: గుంటూరు జిల్లాలో కలరా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసులు 10కి చేరాయి. బాధితులు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా వాసికి కలరా సోకినట్లు అధికారులు గుర్తించారు. కలరా బాధితుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. గుంటూరులో 7 వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.