AP: హేతుబద్ధీకరణపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలవీరాంజనేయస్వామి చర్చలు జరిపారు. అనంతరం ఉద్యోగుల నుంచి మంత్రి వినతిపత్రాలను స్వీకరించారు. తమకు పదోన్నతులు కల్పించాలని, PRC వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ABC కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.