తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై నిన్ననే హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు అక్షింతలు వేసి 24 గంటలు కూడా గడవకముందే, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ఆదేశాలను కాదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.