»Bithiri Sathi Dissatisfied With Seetha Payanam Trailer
అర్జున్కి బిత్తిరి సత్తి చురక
సీతా పయనం అనే అర్జున్ స్టారర్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా లవ్ ట్రాక్కి అవసరమైన విజువల్స్నే వాడారు. కానీ సీతా పయనం చిత్రంలో నటించిన బ్రహ్మాండమైన పాప్యులారిటీ ఉన్న బిత్తిరి సత్తి కూడా ఉన్నాడు. ఆయన విజువల్ ఒక్క ఫ్రేం కూడా లేదు.
ఈ మధ్యరోజుల్లో సినిమాకి సంబంధించి విడుదల చేసే టీజర్లలో, ట్రైలర్లలో కొందరు ప్రముఖ నటుల్ని, పాప్యులారిటీ ఉన్న సెలబ్రిటీలను కూడా కట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఈవెంట్కొచ్చిన సదరు వ్యక్తులు బహిరంగంగా, మీడియా ముందే చురకలు వేస్తున్నారు. కొంతమందైతే ఇతరులకి చెప్పుకుని బాధపడుతున్నారు. దీనికి సంబంధించి, నిన్ననే జరిగిన సీతా పయనం అనే అర్జున్ స్టారర్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా లవ్ ట్రాక్కి అవసరమైన విజువల్స్నే వాడారు. కానీ సీతా పయనం చిత్రంలో నటించిన బ్రహ్మాండమైన పాప్యులారిటీ ఉన్న బిత్తిరి సత్తి కూడా ఉన్నాడు. ఆయన విజువల్ ఒక్క ఫ్రేం కూడా లేదు.
బిత్తిరి సత్తి తన ఉపన్యాసంలో ఈ మాటను మర్చిపోకుండా రెండు మూడు సార్లు ప్రస్తావించాడు. హుషారుగా మాట్లాడుతూనే చురకలంటించాడు. సినిమాని బాగా హైలైట్ చేస్తూనే మరో పక్క తన బాధను కూడా వెళ్ళగక్కాడు. హీరో, నిర్మాత, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ ముఖం పాలిపోయింది. నవ్వలేక ఏడవలేక అన్నట్టుగా మొహం వేలేసుకుని కూర్చున్నాడు.
వేదిక మీద ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు సుకుమార్ కూడా కొంచెం ఇబ్బంది పడినట్టుగానే కనిపించాడు. అయినా బిత్తిరి సత్తి మాత్రం తన పద్ధతిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జున్కీ, సుకుమార్కీ, ఉపేంద్రకీ ఎంత ఒవేషన్ వచ్చిందో అంతకు మించి కొంచెం ఎక్కువ మోతాదులోనే బిత్తిరి సత్తి రెస్పాన్స్ రావడం ఇక్కడ విశేషంగా చెప్పాలి. బిత్తిరి సత్తి రీల్స్, సోషల్ మీడియాలో తను చేసే హల్చల్ బిత్తిరిసత్తికి బాగానే పాప్యులారిటీని తెచ్చంది. ఈ విషయాన్ని సుకుమార్ తన ప్రసంగంలో కోట్ చేశాడు కూడా. బిత్తిరి సత్తి రీల్స్ ని తన భార్య అప్పుడప్పుడు చూపిస్తుంటందని చెప్పాడు. కాకపోతే సీతాపయనం ట్రైలర్లో ఎక్కువగా హీరోహీరోయిన్ల మధ్య లవ్స్టోరీని చెప్పడానికే ఉపయోగించారు. తర్వాత సడెన్గా అర్జున్ సీరియస్ ఎంట్రీని చూపించారు. నిజానికి కామెడీ పాయంట్ని చెప్పాలనుకోలేదు.
ఇంతకు ముందు కూడా లైలా చిత్రం సందర్భంలో విడుదల చేసిన ట్రైలర్లో తాను లేకపోవడాన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు పృధ్వీ రాజ్ అందరికీ చెప్పుకుని బాధపడ్డాడు. ఫంక్షన్కొచ్చిన ముఖ్యఅతిధులు కూడా దీనిని గమనించి, నేరుగా పృద్శీతోనే వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.