విశాఖ హనిట్రాప్ కేసులో బాధితుడి తల్లి మంగళవారం విశాఖలో ప్రెస్మీట్ పెట్టింది. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని జాయ్ జమియా తన కుమారిడితో పరిచయం పెంచుకుందని తెలిపింది. అమెరికా నుంచి అతనిని వైజాగ్కిి రప్పించిన ఆమె.. జ్యూస్లో మత్తు మందు కలిపి పెట్టిన ఇబ్బందులను వాయిస్ మెసేజ్ ద్వారా తమకు తెలియజేశాడని పేర్కొంది.
ATP: రాప్తాడు రైల్వేగేట్ దగ్గర ఒక తోటలో భారీగా గోవా మద్యం డంపు దొరకడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అసలు గోవా నుంచి మద్యం ఎలా వచ్చింది. ఇక్కడ ఎవరు డంప్ చేశారో వివరాలు వెల్లడించాలని అధికారులను కోరారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలంలోని కోలమూరు గ్రామం జాతీయ రహదారి వంతెన దిగువన ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రూట్ వాచ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆటోలో తనిఖీలు నిర్వహించగా 10 కిలోల గంజాయిని గుర్తించి, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.
W.G: పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో మంగళవారం పేకాట స్థావరాలపై ఇన్చార్జ్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. ఈ సందర్భంగా 12 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,01,650లు నగదు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. హెచ్.సీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ అడ్డా శ్రీనివాస్ పాల్గొన్నారు.
VZM: గంట్యాడ పోలీసులు మంగళవారం కోడి పందాల స్దావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ మేరకు మండలంలో చినమధుపాడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కోడిపందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రెండు కోడిపుంజులు, వెయ్యి రూపాయల నగదు, 7 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి వారిపై పై కేసు నమోదు చేశారు.
కడప: కొండాపురం మండలంలోని బ్రాహ్మణపల్లి బస్టాప్ వద్ద మంగళవారం లారీ, బైక్ ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి కొండాపురం వైపు వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టుకోవడంతో బైక్పై ఉన్న బింగి తిరుపాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తిరుపాల్ ఏటూరు గ్రామానికి చెందినవాడు. గత కొంతకాలంగా తాడిపత్రిలో నివాసం ఉంటున్నాడు.
VZM: నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి గ్రామంలో మంగళవారం వేకువజామున పురిళ్లు దగ్ధమైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాడుగుల గురువులు అనే వృద్ధుడు ఒంటరిగా పురి పాకలో నివాసం ఉంటున్నాడు. వేకువజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న గురువులు తేరుకొని తప్పించుకొని బయటకి వచ్చాడు.
AP: వైసీపీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. సజ్జలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.
AP: విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. విశాఖకు చెందిన మహిళ నిన్న రాత్రి తలకు గాయమై స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. దీన్ని అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జి ప్రకాష్ దుస్తులు తీయాలని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
NRPT: గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాలకు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై రోజు రాత్రి గుండుమాల్- పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు.
TG: హైదరాబాద్లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 600 గ్రాముల డ్రగ్స్ను మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల-నందిపల్లె రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వివరాలు తెలియ రాలేదన్నారు. మృతుడు పసుపు, తెల్లని రంగు ఫుల్ హాండ్స్ టీ షర్టు, ఎరుపు, పసుపు కలర్ షార్ట్ ధరించినట్లు చెప్పారు.
KRNL: ఆదోని పట్టణం ప్రశాంత్ నగర్లో నివాసం ఉంటున్న గోపాల్ అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ అఘాయిత్యానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హథ్రాస్లో కారు- కంటెయినర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: భూవివాదంతో సోదరుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటన తిప్పర్తి మండలంలో జరిగింది. మండలంలోని మామిడాలకి చెందిన గజ్జి లింగయ్య, చంద్రయ్య అన్నదమ్ములు. ఇరువురి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ రోజు లింగయ్య, చంద్రయ్య కుమారులు గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.