• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రైల్వేస్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్య

W.G: భీమవరం టు టౌన్ రైల్వే స్టేషన్‌లో మాదు వెంకటేశ్వరరావు (66) అనే వ్యక్తి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటేశ్వరరావు పాలకొల్లు మండలం లంకల కోడేరు వెదుళ్లపాలేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

January 17, 2025 / 01:57 PM IST

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

HYD: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలింనగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

January 17, 2025 / 09:55 AM IST

వివాహితపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

E.G: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన సీతానగరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన గణపతి గురువారం తెల్లవారుజామున అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.

January 17, 2025 / 08:17 AM IST

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని షేక్‌పేట్ రిలయన్స్ ట్రెండ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 17, 2025 / 08:01 AM IST

కొత్తపల్లి గ్రామ శివారులో కారు బోల్తా

KNR: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రి ఓ కారు బోల్తా పడింది. రోడ్డుపక్కనే ఉన్న పత్తిపాక మొగిలి పొలం వద్ద కారు రివర్స్‌లో పడి ఉంది. ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

January 17, 2025 / 05:25 AM IST

ఆటో కారు ఢీ.. పలువురికి గాయాలు

ATP: తాడిపత్రి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రగుంటపల్లి గ్రామం వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై ఆటో, కారు ఢీకొన్నాయి. కొండాపురం నుంచి తాడిపత్రికి వస్తున్న ఆటో, తాడిపత్రి నుంచి వెళ్తున్న కారు వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

January 16, 2025 / 05:32 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

TG: యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం కొండగడపలో విషాదం చోటుచేసుకుంది. షిరిడీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కొండగడప వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 16, 2025 / 05:18 PM IST

చికిత్స పొందుతూ మహిళ మృతి

VZM: సీతానగరం మండలం బూర్జలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఈనెల 10వ తేదీన వంట కలపతో నీరు కాయడానికి మంట పెట్టింది. ఆ సమయంలో మరో పని చేస్తుండగా ఆమె చీరకు మంట తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విజయలక్ష్మిని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

January 16, 2025 / 12:34 PM IST

సముద్రంలో మునిగి బాలుడి మృతి

KKD: అనకాపల్లి జిల్లాలోని రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం తునికి చెందిన బాలుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కనుమ రోజు సరదాకోసం సముద్రతీరానికి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. వీరిలో సాత్విక్(10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ(22) గల్లంతయ్యాడు.

January 16, 2025 / 08:25 AM IST

తల్లి తిట్టిందని కొడుకు ఆత్మహత్య

HYD: తల్లి తిట్టిందని కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ డబిల్‌పుర రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం చితరి హనుమంతు(22) మేడ్చల్లో కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. తల్లి మందలించడంతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

January 16, 2025 / 08:03 AM IST

కేబీహెచ్‌బీలో అగ్నిప్రమాదం

HYD: నగరంలోని కేబీహెచ్‌బీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మేరకు వివరాల ప్రకారం.. ఓ టిఫిన్ సెంటర్‌లో మంటలు చెలరేగినట్లు పలువురు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు బైకులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 16, 2025 / 07:08 AM IST

యువకుడు ఆత్మహత్యాయత్నం

W.G: పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో కోడి పందేల బరి వద్ద జరిగిన ఘర్షణలో ఒక యువకుడు కాగుతున్న నూనె ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమ్మిశెట్టి గంగాధర్ మంగళవారం రాత్రి గుండాట వద్ద జరిగిన ఘర్షణలో అక్కడే కాగుతున్న నూనెను ఒంటిపై పోసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

January 15, 2025 / 07:20 AM IST

ఖమ్మం శివారులో మహిళ సూసైడ్

KMM: చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

January 14, 2025 / 09:49 AM IST

మనవడిని హత్య చేసిన తాత అరెస్ట్

W.G: వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో మద్యం మత్తులో మనవడు చింతా నాగరాజును హత్య చేసిన తాత ఆదినారాయణను సోమవారం అరెస్ట్ చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపారు. శనివారం రాత్రి మద్యం తాగి తాత మనవడు మిగిలి ఉన్న మద్యం బాటిల్ కోసం గొడవపడ్డారు. వివాదంలో తాత మనవడి చాకుతో పొడిచి చంపిన విషయం విధితమే. సోమవారం ఆదినారాయణను న్యాయస్థానంలో హాజరు పరిచారు.

January 14, 2025 / 08:16 AM IST

ఎల్. కోటలో చెరువులో పడి వ్యక్తి మృతి

VZM: ఎల్.కోట మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మల్లివీడుకు చెందిన వీరనాగా పాత్రుడు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సాయత్రం బహిర్భూమికి వెళ్లిన పాత్రుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

January 14, 2025 / 07:50 AM IST