MBNR: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కంసాన్పల్లికి చెందిన నారమ్మ(32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
E.G: గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు, రూ. 22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి లలిత విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. 2015లో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేయగా.. రాజమండ్రి కోర్టు తీర్పు ఇచ్చింది.
KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు నుంచి ఆదోని వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: బాసర గోదావరి నదిలో సోమవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి వయస్సు సుమారు 65 సంవత్సరాల ఉంటుందని, మృతుడు నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ వాసిగా గుర్తించారు.
శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి పూజారి కళావతి హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఘటన స్ధలాన్ని పరిశీలించి హత్యకు కారణాలపై ఆరా తీశారు. క్లూస్ టీమ్తో ఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో ( సోమవారం తెల్లవారుజామున) గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేశారు. తిరుపతిరావు ఆంధ్రపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KRNL: పాణ్యంలోని జాతీయ రహదారిపై సాయిబాబా నర్సరీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో దిగి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై ప్రయాణిస్తున్న వారికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందిన ఘటన రామారెడ్డి మండలం అన్నారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొక్కిలి జంపాల రవి(48) ఆదివారం మృతి చెందాడు. మృతుడిని కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా రవికి తన సోదరులతో ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒమ్మేవరం గ్రామానికి చెందిన ప్రతాప్ బైక్పై ఒంగోలు వెళ్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతాప్ చనిపోయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చౌటపల్లిపాలెం గ్రామ సమీపంలో రహదారి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పోకూరి కృష్ణమోహన్కి చెందిన ఖాళీ స్థలంలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ మంటల్లో కాలిపోయింది. అద్దంకి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. రూ.40 వేల వరకు నష్టం జరిగినట్లు బాధితుడు కృష్ణమోహన్ తెలిపారు.
హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హోర్డింగ్ కిందకు దింపుతుండగా ఘటన జరిగింది. మృతులు సూర్యాపేట జిల్లా కేసముద్రానికి చెందిన బాలు, మల్లేష్గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
HYD: తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాగన్నకూడా వద్ద బైక్ – కార్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి వేగంగా వచ్చిన బైకర్స్.. కారు ఢీ కొట్టడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి వరకు రోడ్డంతా ట్రాఫిక్తో నిండిపోయింది. గాయాలైన వారిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ELR: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిపై కొడుకు గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం ఏలూరులో చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
W.G: భీమవరం టు టౌన్ రైల్వే స్టేషన్లో మాదు వెంకటేశ్వరరావు (66) అనే వ్యక్తి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటేశ్వరరావు పాలకొల్లు మండలం లంకల కోడేరు వెదుళ్లపాలేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.