E.G: బొమ్మూరుకు చెందిన పెనుమళ్ళ రమ్య స్మృతి(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చికిత్స కోసం వచ్చింది. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. పరిస్థితి విషమించడంతో KKD జీజీహెచ్లో చేర్చగా ఆదివారం మృతి చెందింది.
CTR: చిత్తూరులో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. చవటపల్లిలోని దుర్గమ్మ గుడి దేవస్థానం వద్ద ఆదివారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురికీ తరలించామన్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
KMM: ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని గోనబావి క్రాస్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఈ రోజు బోల్తా పడింది. ఈ ఘటనలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్తున్న 6 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పెద్ద ప్రమాదం తప్పిందని పాఠశాల హెచ్ఎం తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పల్నాడు: గురజాల పట్టణంలోని కారంపూడి రోడ్లో యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ నీటిబావిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. 19వ మలుపు వద్ద స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వాసులు గాయపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి(25)ని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: HYD గుడిమల్కాపూర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో ఫిల్లర్ నం.111 వద్ద కార్ డెంటింగ్ కారాగారంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న సైన్ బోర్డు, వెల్డింగ్ కారాగారానికి వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లు రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
MNCL: జైపూర్లోని పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గూడూరు అజయ్ను గురువారం కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. విధుల్లో భాగంగా భోజన సమయంలో తన బైక్పై బయటకు వస్తున్న క్రమంలో ఎస్ ఈ ప్రసాద్ అనే సింగరేణి అధికారి కారు అజయ్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అజయ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TG: బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడి ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYDలో జరిగింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నట్లు అక్క.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న ఆందోళనలో జామై ఉస్మానియా రైల్వే ట్రాక్పై పడి ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణా: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. మిర్చి కోతకు ఆటోలో కూలీలు పనికి వెళ్తుండగా తిరువూరు నుంచి ఉమ్మడిదేవరపల్లి వెళుతున్న బస్సు ఢీ కొట్టింది. కూలీలలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన మిగిలిన కూలీలు 108కి సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మంచు ప్రభావంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ప్రకాశం: కొండేపిలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ముండ్లమూరు మండలం శంకరాపురంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
కర్ణాటకలోని సింధనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా వాసులు మరణించారు. తుఫాను వాహనం బోల్తా పడి డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు రాత్రి మంత్రాలయం నుంచి హంపికి బయలుదేరారు. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉన్నారు. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా: చల్లపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణరావునగర్ కాలనీకి చెందిన పెయింటర్ దేవనమైన వెంకట వరప్రసాద్(21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. గత రెండు వారాలుగా పనికి వెళ్ళటం లేదని తల్లి మందలించటంతో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.