Haryana: జైలు వ్యాన్‌లో మహిళా ఖైదీపై అత్యాచారం చేసిన పురుష ఖైదీలు

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని జైల్లో శక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇద్దరు పురుష ఖైదీలతో చికిత్సకు తీసుకెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత ఖైదీలను మళ్లీ వ్యాన్‌లో ఎక్కించగా ఆ ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 05:38 PM IST

Haryana: నేరాలు చేస్తే జైలుకు పంపుతారు. మరి జైలులో ఉంటున్న ఖైదీలు నేరాలు చేస్తే ఇంకా వాళ్లకి శిక్ష ఏంటి? చేసిన తప్పు తెలుసుకోవాలని జైలుకి పంపుతారు. కానీ తప్పు తెలుసుకోకుండా మళ్లీ తప్పులు చేసేవాళ్లు కూడా కొందరు ఉన్నారు. జైలు వ్యాన్‌లో మహిళపై జరిగిన అత్యాచారమే దీనికి నిదర్శనం. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని జైల్లో శక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇద్దరు పురుష ఖైదీలతో చికిత్సకు తీసుకెళ్లారు.

ఇది కూడా చూడండి: Elon Musk : ఎలాన్ మస్క్ భారత దేశ పర్యటన వాయిదా.. కారణమిదే

రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు జైలు వ్యాన్‌లో సిబ్బంది తీసుకెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత ఖైదీలను మళ్లీ వ్యాన్‌లో ఎక్కించారు. తర్వాత సిబ్బంది డాక్యుమెంట్ వర్క్‌లో లీనమయ్యారు. దీంతో ఆ ఇద్దరు పురుష ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించి తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళా ఖైదీ పోలీసుకుల ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Summer: సమ్మర్‌లో అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే..!

Related News