• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వడివడిగా జలధార పనులు

VZM: జిల్లాలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 8,059 చెరువుల పరిధిలో వేలాది పనులు చేపట్టి పూడికతీత, కాలువల శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేస్తున్నారు. ఈ పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు సుమారు 2.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అధికారులు సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నారు.

April 26, 2026 / 05:24 PM IST

ఘనంగా కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు

ప్రకాశం: బేస్తవారిపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఇవాళ అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు కోరుకున్నారు.

April 26, 2026 / 05:23 PM IST

మంత్రి స్వామిని కలిసిన కొండపి నూతన సీఐ

ప్రకాశం: టంగుటూరు(M) తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో నూతన కొండపి సీఐగా బాధ్యతలు చేపట్టిన రమణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. కొండపి సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలన్నారు.

April 26, 2026 / 05:21 PM IST

‘మహిళలపై హింస పెరుగుతోంది’

VSP: డిజిటల్ వ్యవస్థ వల్లే స్త్రీలపై రోజురోజుకూ హింస పెరుగుతుందని ప్రగతిశీల మహిళా సంఘ ఉద్యమనేత సంధ్యా అన్నారు. ఈ మేరకు ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జనరల్ కౌన్సిల్ సమావేశంలొ ఆమె మాట్లాడారు. స్త్రీలపై హింస కట్టడిలోప్రభుత్వాలు నియంత్రణలో విఫలమయ్యాయని విమర్శించారు. రోజూ మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

April 26, 2026 / 05:17 PM IST

అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి: ఎమ్మెల్యే

PLD: వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. వెంకుపాలెం పరిసరాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహజ వనరుల పరిరక్షణలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

April 26, 2026 / 05:17 PM IST

చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొడవ

KDP: చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కడప గ్రామంలో శనివారం రాత్రి దాడి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓబులేశ్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఓబులేశ్ తలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 26, 2026 / 05:14 PM IST

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు: EO

ELR: ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఈసారి సంప్రదాయబద్ధంగా కోలాటాలు, నృత్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ EO వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.

April 26, 2026 / 05:13 PM IST

ఎన్జీవోస్ కాలనీలో శక్తి యాప్ అవగాహన

నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఆదివారం శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ మహిళల భద్రతకు ఆయుధంలా ఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యల సమయంలో వన్ స్టాప్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేయించి వినియోగంపై శిక్షణ ఇచ్చారు.

April 26, 2026 / 05:12 PM IST

పవన్ కళ్యాణ్ కు సీఐటీయూ లేఖ

W.G: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసింది. ఆదివారం లేఖ ప్రతులను సంఘం జిల్లా నేతలు ఆంజనేయులు, శివరావు భీమవరంలో విడుదల చేశారు. కార్మికులకు కేవలం సన్మానాలు కాకుండా, పదవీ విరమణ ప్రయోజనాలు, సెలవులు కల్పించాలని వారు కోరారు.

April 26, 2026 / 05:12 PM IST

గ్రీవెన్స్ కార్యక్రమం స్థలం మార్పు

చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రేపు జరగనున్న “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు పాత డీపీవో కార్యాలయం స్థానంలో పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించబడుతుంది. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.

April 26, 2026 / 05:08 PM IST

‘మా పొలం లాక్కోడానికి చూస్తున్నారు’

NLR: తమ ఇద్దరు కూతుళ్లు, కొడుకు మీద తమ అమ్మ 60 సెంట్లు భూమి రాసిస్తే తమ అక్క అయినా సీతారావమ్మ 60 సెంట్లు కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆదిశేషమ్మ అనే మహిళ వాపోయారు. ఆమె మాట్లాడుతూ.. బుచ్చి మండల రెవెన్యూ పరిధిలో ఉన్న కావేటి పాలెం పొలంలో తాము వరి నాట్లు వేస్తే రాత్రి పూట తొక్కించేసారని వాపోయారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోయారు.

April 26, 2026 / 05:03 PM IST

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో తెనాలి వాసి

GNTR: తెనాలికి చెందిన కావూరి సాయితేజ (బౌలర్) ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇతడిని కాకినాడ కింగ్స్ టీం రూ.2 లక్షలకు దక్కించుకుంది. 26 ఏళ్ల సాయితేజ గత ఏడాది సింహాద్రి వైజాగ్ లయన్స్ తరపున ఆడాడు. APLలో బెజవాడ టైగర్స్ తరపున కూడా ఆయన రాణించాడు. అమెరికాలో స్థానిక లీగ్స్‌లో రాణించి, 2022లో అమెరికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

April 26, 2026 / 05:03 PM IST

మహాభారత మహోత్సవానికి ఆహ్వానం

CTR: వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లిలో నిర్వహించనున్న శ్రీకృష్ణ–ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి 90వ మహాభారత మహోత్సవానికి ఆహ్వాన పత్రికను టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ మురళికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాభారత ధర్మకర్త గాలి వెంకటేశ్వర్లునాయుడు, మాజీ ఎంపీటీసీ గాలి నాదమునినాయుడు, పాతగుంట మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.

April 26, 2026 / 04:55 PM IST

నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించిన నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

April 26, 2026 / 04:49 PM IST

మైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కమిషనర్

కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివారం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. పనులు ముగిసిన వెంటనే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.

April 26, 2026 / 04:46 PM IST