NDL: జూపాడు బంగ్లా మండలం తంగడంచలో ఉల్లి పంటను ఆదివారం పరిశీలించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, ఉల్లి రైతులకు క్వింటాకు కనీస మద్దతు ధరగా రూ. 2 వేలును ప్రకటించాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో రైతులు ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
KRNL: ఎమ్మిగనూరులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గ కో- ఆర్డినేటర్ కాసిం వలి ఆదివారం మాట్లాడుతూ.. 10 రోజులుగా ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని అయన పేర్కొన్నారు.
ATP: మాజీ మంత్రి కీర్తిశేషులు పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉండి, ప్రజా సేవలో ముందుంటానని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు.
NLR: కావలిలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలని కోరారు. కచ్చితమైన సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
CTR: జనగణన-2027 విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ కూడలి వద్ద నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణన అందుబాటులో ఉండగా, https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా ప్రజలే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.
KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆదివారం ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో దళితుల సంక్షేమానికి పోరాడాలని నేతలకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్లో జరుగుతున్న సామూహిక వివాహాలకు హాజరయ్యారు.
కోనసీమ: పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఆర్డిఓ జి. మమ్మీ కొత్తపేటలోని పెట్రోల్ బంకులను ఆదివారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను బట్టి అందరికీ సమానంగా విక్రయించాలన్నారు.
KDP: ఇంధన కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆదివారం కడప పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కడప నగరంలో 234 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ కొన్ని మూసివేయడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. జేసీ చేసిన ప్రకటనకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఇంధన కొరత నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ELR: దేశంలోని కార్మిక వర్గాన్ని 140 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు నెట్టి వేసేందుకు తెచ్చిన 4 లేబరు కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పిఎఫ్, ఈఎస్సై, గ్రాట్యూటీ వంటి పథకాలు పొందడానికి ఇవి అడ్డుపడయతన్నారు.
CTR: పుంగనూరులో జాతీయ రహదారికి రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గృహాలను కూల్చి వేసినప్పుడు ఆ వ్యర్థాలను పలమనేరు రోడ్డు ఓం శక్తి ఆలయం వద్ద నుంచి తోపుమట్టం వరకు డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరపాటులో ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
KKD: పెద్దాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ, గ్రామోత్సవం, పల్లకి సేవతో పాటు 108 కన్యలతో ఊరేగింపు ఘనంగా సాగింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, పైడా సత్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
NTR: చందర్లపాడు హైస్కూల్లో ఇవాళ జిల్లా అంధ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. శిబిరంలో స్థానిక ప్రజలు, వృద్ధులు, మహిళలు పాల్గొని కంటి సంబంధిత సమస్యలకు ఉచిత పరీక్షలు, అవసరమైన మందులు పొందారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు పెద్ద మేలు చేస్తాయన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని రాంకో సిమెంట్ కళ్యాణ మండపంలో ఇవాళ మీర్జాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి కుమార్తె అఖిల నవీన్ కుమార్ రెడ్డి వివాహ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలలో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.
GNTR: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరఫరాలో చిన్న అంతరాయాల వల్లే కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్పై చర్యలు, రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రజలు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను సత్యసాయి జిల్లా కురుబ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కురుబ సంఘం బలోపేతానికి సభ్యులు చురుగ్గా కృషి చేయాలని మంత్రి సూచించారు. సంఘం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.