ఏలూరు: జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 3.44 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. వీరిని రానున్న మూడేళ్లలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.