అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో ఈ నెల 22 నుంచి ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్ర జట్టుకు రికీ భూయ్ కెప్టెన్గా, స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. విదర్భ జట్టు అక్షయ్ వాడ్కర్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.