MNCL: మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తున్నామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. మహిళ సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.