• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపటి పీజీఆర్ఎస్‌ రద్దు

విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల సందడి నెలకొంది. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులుహాజరవుతున్న నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ‘పీజీఆర్ఎస్‌’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రకటించారు. కావున ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

April 26, 2026 / 03:13 PM IST

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: MRO

WG: నరసాపురం పెట్రోల్ బంకుల్లో ఆదివారం MRO ఐ.వి.వి. సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని పలు బంకుల్లో ఇంధన నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించినా, డీజిల్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.

April 26, 2026 / 03:11 PM IST

జిల్లాల కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆదివారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సుమారు 10 శాతం బంకుల్లో సరఫరా లేక మూతపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్యానిక్ కొనుగోళ్లతో డిమాండ్ 50 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కర్నూలు, నంద్యాల కలెక్టర్లను వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

April 26, 2026 / 03:11 PM IST

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక

NLR: నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామానికి చెందిన పలువురు ఆదివారం టీడీపీలో చేరారు. వారికి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పసుపు కండువా వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యువత టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

April 26, 2026 / 03:01 PM IST

హిందూపురంలో రూ.79 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం

SS: అమృత్ 2.0 పథకం కింద హిందూపురంలో రూ.79 కోట్లతో 28 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ప్లాంట్ కోసం 4.5 ఎకరాల భూమిని ఆదివారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

April 26, 2026 / 02:50 PM IST

‘ఉల్లి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి’

NDL: జూపాడు బంగ్లా మండలం తంగడంచలో ఉల్లి పంటను ఆదివారం పరిశీలించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, ఉల్లి రైతులకు క్వింటాకు కనీస మద్దతు ధరగా రూ. 2 వేలును ప్రకటించాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌లో రైతులు ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

April 26, 2026 / 02:46 PM IST

ఇంధన కొరతపై కాంగ్రెస్ ఆందోళన

KRNL: ఎమ్మిగనూరులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గ కో- ఆర్డినేటర్ కాసిం వలి ఆదివారం మాట్లాడుతూ.. 10 రోజులుగా ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని అయన పేర్కొన్నారు.

April 26, 2026 / 02:46 PM IST

మహేంద్రనాథ్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటా: ఎమ్మెల్యే

ATP: మాజీ మంత్రి కీర్తిశేషులు పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉండి, ప్రజా సేవలో ముందుంటానని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు.

April 26, 2026 / 02:42 PM IST

ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలి: కమిషనర్

NLR: కావలిలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలని కోరారు. కచ్చితమైన సమాచారం ఇస్తే ప్రభుత్వ పథకాలు అందజేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

April 26, 2026 / 02:37 PM IST

జనగణన విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం

CTR: జనగణన-2027 విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ కూడలి వద్ద నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణన అందుబాటులో ఉండగా, https://se.census.gov.in⁠ వెబ్‌సైట్ ద్వారా ప్రజలే వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.

April 26, 2026 / 02:34 PM IST

దళితుల సంక్షేమానికి పోరాడాలి: RS ప్రవీణ్

KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఆదివారం ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో దళితుల సంక్షేమానికి పోరాడాలని నేతలకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్లో జరుగుతున్న సామూహిక వివాహాలకు హాజరయ్యారు.

April 26, 2026 / 02:33 PM IST

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన ఆర్డీవో

కోనసీమ: పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్తపేట ఆర్డిఓ జి. మమ్మీ కొత్తపేటలోని పెట్రోల్ బంకులను ఆదివారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను బట్టి అందరికీ సమానంగా విక్రయించాలన్నారు.

April 26, 2026 / 02:33 PM IST

‘ఇంధన కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలుతీసుకోవాలి’

KDP: ఇంధన కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఆదివారం కడప పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కడప నగరంలో 234 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ కొన్ని మూసివేయడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. జేసీ చేసిన ప్రకటనకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఇంధన కొరత నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

April 26, 2026 / 02:31 PM IST

‘లేబర్ కోడ్లు రద్దు చేసేంతవరకు పోరాడుతాం’

ELR: దేశంలోని కార్మిక వర్గాన్ని 140 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు నెట్టి వేసేందుకు తెచ్చిన 4 లేబరు కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పిఎఫ్, ఈఎస్సై, గ్రాట్యూటీ వంటి పథకాలు పొందడానికి ఇవి అడ్డుపడయతన్నారు.

April 26, 2026 / 02:30 PM IST

జాతీయ రహదారి పక్కన మట్టికుప్పలు

CTR: పుంగనూరులో జాతీయ రహదారికి రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గృహాలను కూల్చి వేసినప్పుడు ఆ వ్యర్థాలను పలమనేరు రోడ్డు ఓం శక్తి ఆలయం వద్ద నుంచి తోపుమట్టం వరకు డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరపాటులో ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

April 26, 2026 / 02:29 PM IST