BPT: మార్టూరు మండలం వలపర్లలో రూ. 198 కోట్లతో సోలార్ సెల్ మాడ్యులర్ యూనిట్ ఏర్పాటుకు ఒక ప్రైవేట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ యూనిట్ స్థాపనతో స్థానికంగా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కానుంది.