NDL: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6,60,000 మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం PGRS కార్యక్రమంలో SP సునీల్ షొరాణకు నంద్యాలకు చెందిన శ్రీధర్ రావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్కు చెందిన సంపత్ కుమార్ రెడ్డి తనను మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.