విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలోపేతం చేయడం కూడా మార్కెట్కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్కు మద్దతు ఇచ్చాయి.
మంగళవారం నాడు ఆయన భార్య టీనా అంబానీని ఈడీ ప్రశ్నిస్తోంది. దీంతో టీనా అంబానీ ఈడీ ఎదుట హాజరై వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి ED ఈ విచారణ చేస్తోంది.
భారతీయ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వ్యక్తులకు, సంస్థలకు పన్నుల మినహాయింపు ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుంటే పన్ను చెల్లింపుదారులు తమ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఇండియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 450 పాయింట్లకుపైగా వృద్ధి చెందగా, నిఫ్టీ 19, 300 ఎగువన కొనసాగుతుంది. అయితే అందుకు గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
Twitter:ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మార్పులు చేశాడు. ఈసారి వెరిఫై చేయని వినియోగదారుల కోసం ట్వీట్ పరిమితిని ఫిక్స్ చేశాడు. అతను ప్రవేశ పెట్టిన నియమం ప్రకారం.. ధృవీకరించబడిన వినియోగదారులు 10000 ట్వీట్లను చదివే అవకాశం పొందుతారు, కాని ధృవీకరించబడని వినియోగదారులు 1000 ట్వీట్లను మాత్రమే చూడగలరు. ఈ నిబంధనను తాత్కాలికంగా అమలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధిం...
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
వారం చివరి ట్రేడింగ్ సెషన్లో అంటే శుక్రవారం కూడా మార్కెట్ జోరు కొనసాగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. నేటి వ్యాపారంలో సెన్సెక్స్ 803 పాయింట్ల లాభంతో 64,768 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ నిఫ్టీ కూడా ఈరోజు 19201కి చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వేగంతో సెన్సెక్స్ గత 3 రోజుల్లో 1800 పాయింట్లు ఎగబాకింది.
జూలై 1 నుండి HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్ రెండూ ఒకటిగా విలీనం కానున్నాయి. కలిసి వ్యాపారం చేస్తారు. జూన్ 30న హెచ్డిఎఫ్సి,హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డు మీటింగ్ ఉంటుంది. దీనిలో విలీనం అమలులోకి వస్తుంది.
దేశంలో టమాటాలు,పప్పుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని దించే ప్రయత్నం చేస్తోంది. టమాటా ధరలు పెరగడాన్ని సీజనల్గా ప్రభుత్వం పేర్కొంటుండగా, వాటి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం త్వరలో పప్పులను దిగుమతి చేసుకోనుంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైయింగ్ కారుకు అమెరికా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.