కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో సోమవారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు జరిగింది. రాజకీయ నాయకుల అండతో పేదల బియ్యం ఆక్రమ రవాణా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. టన్నుల కొద్దీ బియ్యం తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, రెవిన్యూ, పోలీస్ శాఖల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.