TPT: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి శ్రీముఖి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రీముఖితో సెల్ఫీల కోసం ఎగబడారు.