AP: శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.