ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి బీచ్కు పర్యాటకులు తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీరం వద్ద మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.