Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రధాని పర్యటించేందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నారని ఉదాహరిస్తున్నారు.
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు.
NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.
ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.
Ambati Rambabu : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఆయనతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ని సైతం వదల్లేదు. చంద్రబాబు అతి మానిప్యూలేటర్ అని ఆరోపించారు.
ఏపీ రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) హోంమంత్రి అమిత్ షా(amit shah), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, దీంతోపాటు ప్రాజెక్టు ఖర్చులను రీయింబర్స్మెంట్ చేయాలని, ఇతర ఆర్థిక అభ్యర్థనలను సీఎం జగన్ కోరారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తమ పార్టీలోకి రావడానికి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లేదంటే తమ పార్టీ నాయకులు ఆయనతో టచ్ లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.
వ్యక్తిగత విషయాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు జగన్ ఇస్తున్నాడని ఆరోపించింది. కేసుల నుంచి తనను తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులను జగన్ వరుసగా కలుస్తున్నాడని తెలిపింది. అందుకే రెండు వారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్ వెళ్లాడని పేర్కొంటోంది.
కంపెనీలు, పరిశ్రమల వద్ద సెల్ఫీలు తీసుకుని సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కంపెనీలు మీరు తీసుకురాగలరా? అంటూ చాలెంజ్ విసరడం ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.