ఇకపై ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను భక్తులకు ఇవ్వనున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
మెగా బ్రదర్ నాగబాబు(Naga babu)కి జనసేనలో కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏకమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 విరాళంగా ఇస్తే రూ.850 కోట్లు సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలా ఓ నాలుగు నెలల పంపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) మనకే సొంతం అవుతుందన్నారు.
పేదల్ని దోచుకుని వేల కోట్లు దాచుకుని దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం రిచ్ మోహన్ రెడ్డి..పేదలతో ప్రయాణం చేయడం అంటే వారికి అన్యాయం చేయడమా? అని నారా లోకేశ్ నిలదీశాడు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అనినాష్ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను తెలియజేసింది. వివేకా హత్య గురించి ఉదయ్కు ముందే తెలుసు అని పేర్కొంది.
సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేయాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మేధావులు, నిర్వాసితులు, కార్మికులతో కలిసి ఉద్యమించాలని కోరారు.
ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.
యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు