W.G: సహజ సిద్ధంగా పండిన కూరగాయలతో ఆరోగ్యం మెండుగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో ఊర్మిళ అన్నారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం సిబ్బంది స్టాల్లో కూరగాయలను విక్రయించారు. ఆయా కూరగాయలను పలు శాఖల అధికారులు, ప్రజలు కొనుగోలు చేశారు. సీడీపీవో మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా పండించిన పంటను వినియోగించాలన్నారు.