CTR: కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని, వచ్చేవారం యధావిధిగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.