W.G: జిల్లాలో అమలవుతున్న దీపం పథకం-2 అమలుపై జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దీపం పథకం- 2 నిరుపేదలకు ఎలా అందుతుంది, సంబంధించిన సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా అనే అంశాలపై ఆరా తీశారు. ఫిర్యాదులు వచ్చినా తక్షణం విచారించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.