CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధ మహిళ మృతి చెందింది. గంగవరం మండలం బూడిదపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (70) పండుగకు వినాయకపురంలో ఉన్న చెల్లెలి కూతురు ఇంటికి వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో హైవేపై రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరగడంతో ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.