ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పంపిణీ చేశారు. సోమవారం ఒంగోలులోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో 13 మందికి 17 లక్షల 56 వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని చెక్కుల రూపంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.