కృష్ణా: మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో ప్రతి రోజు గొడవలు చోటు చేసుకుంటున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలను వాటి యజమానులు రహదారులపై ఉంచుతున్నారని వాపోతున్నరు. దీంతో రోడ్లపై వాహనాలు తిరిగే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటన వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు.