కృష్ణా: కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన కోటా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి ట్రైన్లో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి రైల్వే స్టేషన్లో భోజనం చేసిన అనంతరం కృష్ణమూర్తి కనపడకపోవడంతో కుమారుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.