నాతవరం మండలం లింగంపేట గ్రామంలో బుధవారం జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు దొర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వెన్నెల ఈవెంట్స్, కాంతార డాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.