కృష్ణా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న పురస్కరించుకొని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం విజయవాడలో ఓ ఫంక్షన్ హాల్లో కూటమి నేతలు అందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు రాజేంద్రప్రసాద్కు వేసేలా పట్టభద్రులను చైతన్యవంతం చేయాలని సూచించారు.