ప్రకాశం: దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల మినీ స్టేడియం ప్రాంతాన్ని మంగళవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కోరమన్నారు. మినీ స్టేడియం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.