KDP: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు సూచనలు చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.