ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ. 3.95 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ. 2,30,320.. ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దులు, గేదెల సంత నుంచి రూ.1,65,300 మేర సుంకం వసూలు అయినట్లు పేర్కొన్నారు.