కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పక్షుల సమస్య తీవ్రమవుతోంది. రన్వే చుట్టుపక్కల చెత్త, ఆహార వ్యర్థాలు వేయడం వల్ల కాకులు, కొంగలు వంటి పక్షులు భారీగా చేరుతున్నాయి. దీనివల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఓ విమానాన్ని పక్షి ఢీ కొనడంతో ఆ సర్వీస్ రద్దయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది కోరుతున్నారు.