E.G: తెలుగు సరస్వతి పరిషత్, కళా గౌతమి సంయుక్త నిర్వహణలో రాజమండ్రిలో ఇవాళ్టి నుంచి 29 వరకు ‘తెలుగు మాటల పండుగ’ జరగనుందని అధ్యక్షుడు డా. పీవీబీ సంజీవరావు తెలిపారు. తొలి రోజు అక్షర దేవతల ఊరేగింపు, రెండో రోజు జానపద దినోత్సవం, మూడో రోజు విద్యార్థులకు తెలుగు క్విజ్, నాలుగో రోజు తెలుగు పేరంటం వంటి కార్యక్రమాలు ఉంటాయని జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు.