SKLM: జిల్లా పోలీసు కార్యాలయంలో రేపు జరగాల్సిన గ్రీవెన్స్ రద్దు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రంజాన్ కారణంగా గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, రాకుండా ఉండాలని సూచించారు. తదుపరి గ్రీవెన్స్ వచ్చే సోమవారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.