ప్రకాశం: గిద్దలూరు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆగస్టు నెలలో మద్యం తాగి వాహనాలను నడిపిన 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నాంచారయ్య తెలిపారు. ఆదివారం జాతీయ రహదారిపై ఎస్సై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అనంతరం తాగి వాహనాలు నడిపితే జరిమానా జైలు శిక్ష తప్పదని నాంచారయ్య హెచ్చరించారు.