ELR: జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. మొంథా తుపాన్ హెచ్చరికల కారణంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.