W.G: ఆకివీడులో కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ భీమేశ్వర, మదన గోపాల, జలదుర్గా శక్తిశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. ఆధునిక వాహనాలకు భిన్నంగా.. సంప్రదాయ రీతిలో ఎడ్ల బండ్లపై సాగిన ఈ ఊరేగింపు అలనాటి స్మృతులను గుర్తుచేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.