ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం కర్ణాటక మైన్స్ మినిస్టర్ మల్లికార్జున్, దావనగేర్ ఎంపీ ప్రభా మల్లికార్జున్తో కలిసి తిరుమలలోని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కనిగిరి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని స్వామిని వేడుకున్నట్లు ఉగ్ర తెలిపారు.