BPT: అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ కాలువలకు మంత్రి రవికుమార్ ప్రారంభోత్సవం చేశారు. కోటి రూపాయలతో నిర్మించిన తారు రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. 35 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.